ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 27, 2021, 6:39 PM IST

ETV Bharat / state

ప్రైవేటు ఆసుపత్రిల్లో అధిక ఫీజులను అరికట్టాలి

ప్రైవేటు ఆసుపత్రిల్లో అధిక ఫీజులను అరికట్టాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలులో ధర్నా చేశారు. కరోనా వైద్యానికి రోజుకు పదివేల రుపాయలకు మించి ఫీజు వసులు చేయకూడదని ప్రభుత్వం చెప్తున్నా.. ప్రైవేట్ ఆసుపత్రులు పట్టించుకోవట్లేదని నాయకులు మండిపడ్డారు.

kurnool
ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలులో ధర్నా

ప్రైవేటు ఆసుపత్రిల్లో అధిక ఫీజుల వసూలును అరికట్టాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలులో ధర్నా చేశారు. కరోనా పేరుతో లక్షల రూపాయల బిల్లులు వసూలు చేస్తున్నారని నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ముందు వారు ఆందోళన చేశారు. కరోనా వైద్యానికి రోజుకు పదివేల రూపాయలకు మించి ఫీజు వసులు చేయకూడదని ప్రభుత్వం చెబుతున్న.. ప్రైవేటు ఆసుపత్రులు పట్టించుకోవట్లేదని నేతలు మండిపడ్డారు. లక్షల రూపాయల బిల్లులు వసూలు చేస్తూ.. అధికారులు కనీసం చర్యలు తీసుకోవట్లేదని శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రులను సీజ్ చెేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details