ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి...రహదారిపై బంధువుల ఆందోళన

కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓవ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆగ్రహించిన బంధువులు మృతదేహాంతో రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.

By

Published : May 29, 2019, 5:50 AM IST

రహదారిపై బంధువుల ఆందోళన

కర్నూలు జిల్లా ఆదోనిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం, వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన బాధిత కుంటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మృతుని బంధువులు పట్టణంలోని భీమస్ కూడలివద్ద శవంతో ధర్నా నిర్వహించారు. దింతో రహదారిపై ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రంగ ప్రవేశం చేసిన పోలీసులు బాధిత కుంటుంబానికి న్యాయం చేస్తామని హామి ఇచ్చారు. వారి జోక్యంతో బంధువులు ఆందోళన విరమించారు.

రహదారిపై బంధువుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details