ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఈనెల 18 నుంచి 22 వరకు భవానీదీక్షల విరమణ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈనెల 18 నుంచి 22 వరకు భవానీదీక్షల విరమణ జరగనుంది. భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో సురేష్ బాబు తెలిపారు.

By

Published : Dec 8, 2019, 8:54 PM IST

Published : Dec 8, 2019, 8:54 PM IST

vijayawada bhavani deeksha will be remove
భవానీదీక్ష

ఇంద్రకీలాద్రిపై ఈనెల 18 నుంచి 22 వరకు భవానీదీక్షల విరమణ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈనెల 18 నుంచి 22 వరకు భవానీ దీక్షల విరమణ జరగనుంది. ఈనెల 11నుంచి సత్యనారాయణపురం శివరామక్షేత్రం నుంచి కలిశ జ్యోతి ఉత్సవాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సురేష్ బాబు మాట్లాడుతూ...అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో భవానీ దీక్షల కోసం తగిన ప్రణాళిక రూపొందించామన్నారు. ఈ ఉత్సవాలకు ఘాట్‌రోడ్డు మీద నుంచి కాకుండా కనకదుర్గ నగర్ నుంచి భక్తులను అనుమతిస్తామని చెప్పారు. జ్యోతులతో ఎవరినీ ఘట్‌రోడ్డు నుంచి అనుమతించేది లేదని ఈవో స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details