ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'చంద్రబాబు ఇంటి గురించి కాదు..ప్రజల సమస్యలు పట్టించుకోండి'

అధికార వైకాపా నేతలు 'చంద్రబాబు నివాసం ఎప్పుడు మునుగుతుందా' అని ఆలోచించకుండా వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలను పట్టించుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్​ చేశారు. మంగళగిరి, ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న కష్టాలను తెదేపా నేతలు వీడియోలు తీశారు. ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించాలన్నారు.

By

Published : Aug 16, 2019, 7:38 PM IST

వరద కష్టాలు

వరద బాధితుల కష్టాలు ఎలా ఉన్నాయో చూడండి: తెదేపా

గుంటూరు జిల్లాలోని మంగళగిరి, ఇతర ప్రాంతాల్లో వరదపై తెదేపా నేతలు వీడియోలు విడుదల చేశారు. వరదతో ప్రజలు ఇళ్లు ముగిని అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మంత్రులు మాత్రం చంద్రబాబు ఇంటి చుట్టూ తిరగటం ఏమిటని నేతలు మండిపడ్డారు. చంద్రబాబు నివాసం ఎప్పుడు మునుగుతుందా అని వైకాపా నేతలు ఎదురుచూస్తున్నారని విమర్శలు చేశారు. ముందు ప్రజలను కాపాడి వారి బాధలు తీర్చాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details