రాజధాని మార్పుపై తెదేపా ఆధ్వర్యంలో రైతుల నిరసన
రాజధాని మార్పునకు వ్యతిరేకంగా కృష్ణా జిల్లా చందర్లపాడులో తెదేపా ఆధ్వర్యంలో రైతులు నిరసన వ్యక్తం చేశారు.
రాజధాని మార్పుపై తెదేపా ఆధ్వర్యంలో రైతుల నిరసన
రాజధాని మార్పునకు వ్యతిరేకంగా కృష్ణా జిల్లా చందర్లపాడులో తెదేపా ఆధ్వర్యంలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట తప్పడంలో.. మడమ తిప్పడంలో మరోసారి నిరూపించుకున్నారన్నారు. మూడు రాజధానుల వల్ల అన్ని ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని... రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్, విజయసాయిరెడ్డిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.