ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 20, 2020, 8:07 PM IST

ETV Bharat / state

పురుగులమందు తాగి విద్యార్థిని ఆత్మహత్య

కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన విద్యార్థిని నూజివీడులో ఆత్మహత్యకు పాల్పడింది. పురుగులమందు తాగి బలవన్మరణం చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

student suiside in nuzivid
పురుగుమందు తాగి విద్యార్థిని ఆత్మహత్య

కృష్ణా జిల్లా నూజివీడులో యువతి ఆత్మహత్య చేసుకుంది. తిరువూరుకు చెందిన సౌజన్య అనే విద్యార్థిని నూజివీడులోని ఎం.ఆర్.అప్పారావు కృష్ణ యూనివర్శిటీ పీజీ సెంటర్​లో ఎంఎస్సీ ఆర్గానిక్ సైన్స్ మొదటి ఏడాది చదువుతోంది. ఈరోజు మధ్యాహ్నం పరీక్షకు హాజరైంది.

అనంతరం పట్టణ పరిధిలోని కృష్ణారెడ్డి కాలనీ సమీపంలో పురుగుమందు సేవించింది. ఇది గమనించిన సమీపంలోని రైతులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థిని మరణించినట్లు వైద్యులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details