ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అద్దె బస్సుల డ్రైవర్ల విధులు బహిష్కరణ

పరిమితికి మించిన ప్రయాణికులకు  ఆర్టీసీ అద్దె బస్సుల్లో అనుమతిస్తున్నారని ఆరోపిస్తూ... మచిలీపట్నం డిపో పరిధిలోని అద్దె బస్సు డ్రైవర్లు విధులను బహిష్కరించారు.

By

Published : May 16, 2019, 12:23 PM IST

'మచిలీపట్నం ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు నిరసన'

'మచిలీపట్నం ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు నిరసన'
కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్‌ వైఖరిని నిరసిస్తూ అద్దె బస్సుల డ్రైవర్లు విధులు బహిష్కరించారు. మచిలీపట్నం నుంచి ఏలూరు వెళ్తున్న అద్దె బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నారని డ్రైవర్‌ బస్సును నిలిపివేయడంపై వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రతి చిన్న విషయానికి డిపో మేనేజర్‌ అద్దె బస్సు డ్రైవర్లను ఇబ్బందులు పెడుతున్నారని డ్రైవర్లు ఆరోపించారు. విధులకు నిరాకరించిన కారణంగా.. 50 అద్దె బస్సులు నిలిచిపోయాయి. ప్రయాణికులకు ఇబ్బంది రాకుండా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details