ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 14, 2020, 5:46 PM IST

ETV Bharat / state

మాకు భరోసానివ్వండి: రేషన్​ డీలర్లు

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్​ డీలర్లకు భరోసా కల్పించాలని విజయవాడ శివారు గొల్లపూడి సివిల్ సప్లయర్స్​ గోడౌన్ ఎదుట రేషన్ డీలర్లు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తమకు కొవిడ్-19 ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్​ చేశారు.

Ration dealers protest for their safety
రేషన్ డీలర్లు ఆందోళన


విజయవాడ శివారు గొల్లపూడి సివిల్ సప్లయర్స్​ గోడౌన్ ఎదుట రేషన్ డీలర్లు ఆందోళన చేపట్టారు. కొవిడ్-19 పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తమకు కొవిడ్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి, పెండింగ్‌ కమిషన్ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కరోనా లాక్​డౌన్​లో ఇప్పటి వరకు ఏడు విడతలు ఎలాంటి భద్రతా చర్యలు లేకున్నా.. సరకులు అందించినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో నలుగురు రేషన్ డిలర్లు కరోనాతో మరణించినా.. ప్రభుత్వం స్పందించకపొవటం బాధాకరమని ఏపీ రేషన్ డిలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు మండాడి వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details