దుర్గ గుడిలో రాహుకేతు పూజలు విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం నుంచి నూతన ఆర్జిత సేవలుగా రాహుకేతు పూజలు ప్రారంభమయ్యాయి. కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మికాంతం, నగర పాలక పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, ఈవో కోటేశ్వరమ్మ తొలి పూజ చేశారు. ఉదయం తొమ్మిది గంటలకు వినాయక పూజతో కార్యక్రమం మొదలైంది. రాహుకేతువుల విగ్రహాలకు పంచలోహ శోదన నిమిత్తం యాగం నిర్వహించారు.
పూజా రుసుముగా 1116 రూపాయలు తీసుకుంటారు. ఒక్క టిక్కెట్కు ఇద్దరిని మాత్రమే అనుమతించాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడు రోజుల్లో ఈ ఆర్జిత సేవను ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నారు. ఆ తర్వాత భక్తుల స్పందన ఆధారంగా రాహుకాలంలో ప్రతిరోజు నటరాజ స్వామి దేవాలయం పక్కన ఈ పూజలు నిర్వహిస్తామని ఈవో కోటేశ్వరమ్మ అన్నారు.