ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 13, 2021, 5:35 PM IST

ETV Bharat / state

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. జగ్గయ్యపేట మైన్స్ యూనిట్​లో అఖిలపక్షం అధ్వర్యంలో కార్మిక సంఘాలు నిరసన చేపట్టాయి. స్టీల్ ప్లాంట్​ను ప్రభుత్వం రంగంలోనే కొనసాగించాలని నాయకులు డిమాండ్​ చేశారు.

Protest against privatization of Visakhapatnam Steel jaggayapeta in krishna district
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన

స్ట్రాటజిక్ సేల్ పేరిట విశాఖ స్టీల్ ప్లాంట్​ను ప్రైవేటుపరం చేసే నిర్ణయాన్ని కేంద్రం తక్షణమే వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్​ చేశాయి. ప్రైవేటీకరణను నిరసిస్తూ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మైన్స్ యూనిట్​లో అఖిలపక్షం అధ్వర్యంలో.. నాయకులు ఆందోళన చేపట్టారు.

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నాయకులు డిమాండ్​ చేశారు. కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే మరింత ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details