'వ్యాక్సిన్ కోసం బారులు : డోసులు మిగిలితేనే టోకెన్లు ఇస్తామనడం ఏమిటీ ?' కొవిడ్ రెండో డోసు కోసం వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. ఉదయం ఏడు గంటల నుంచే కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. టోకెన్ ఇచ్చేందుకే చాలా సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 60 ఏళ్ల పైబడిన వృద్ధులు సైతం ఎండలో నిల్చుని టీకా తీసుకోవాల్సిన దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మిగిలితే ఇస్తామనడం ఏమిటీ ?
మరికొందరు అర్థులకు టోకెన్ ఇవ్వకుండా డోసులు మిగిలితే అప్పుడే ఇస్తామని.. అందాక నిరీక్షించమని సిబ్బంది చెప్పడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండో డోస్ వ్యాక్సిన్ ప్రక్రియ ప్రత్యేక డ్రైవ్ను అధికారులు ఏర్పాటు చేయటంతో ప్రజలు కేంద్రాల వద్దకు భారీగా చేరుకున్నారు. ప్రస్తుతం విజయవాడ కొవిడ్ టీకా కేంద్రాల వద్ద పరిస్థితిని ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.
ఇవీ చూడండి :13.30 లక్షల డోస్లు ఏ మూలకు సరిపోతాయి ?: చంద్రబాబు