ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 6, 2021, 10:07 AM IST

ETV Bharat / state

'వ్యాక్సిన్ కోసం బారులు : డోసులు మిగిలితేనే టోకెన్లు ఇస్తామనడం ఏమిటీ ?'

విజయవాడలోని పలు వ్యాక్సిన్ కేంద్రాల్లో ప్రజలు ఉదయాన్నే బారులు తీరుతున్నారు. క్యూలో నిల్చున్నప్పటికీ వైద్య సిబ్బంది టోకెన్లు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. డోసు నిల్వల మేరకే టోకెన్లు ఇస్తామని చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

'వ్యాక్సిన్ కోసం బారులు : డోసులు మిగిలితేనే టోకెన్లు ఇస్తామనడం ఏమిటీ ?'
'వ్యాక్సిన్ కోసం బారులు : డోసులు మిగిలితేనే టోకెన్లు ఇస్తామనడం ఏమిటీ ?'

'వ్యాక్సిన్ కోసం బారులు : డోసులు మిగిలితేనే టోకెన్లు ఇస్తామనడం ఏమిటీ ?'

కొవిడ్ రెండో డోసు కోసం వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. ఉదయం ఏడు గంటల నుంచే కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. టోకెన్ ఇచ్చేందుకే చాలా సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 60 ఏళ్ల పైబడిన వృద్ధులు సైతం ఎండలో నిల్చుని టీకా తీసుకోవాల్సిన దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మిగిలితే ఇస్తామనడం ఏమిటీ ?

మరికొందరు అర్థులకు టోకెన్ ఇవ్వకుండా డోసులు మిగిలితే అప్పుడే ఇస్తామని.. అందాక నిరీక్షించమని సిబ్బంది చెప్పడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండో డోస్ వ్యాక్సిన్ ప్రక్రియ ప్రత్యేక డ్రైవ్​ను అధికారులు ఏర్పాటు చేయటంతో ప్రజలు కేంద్రాల వద్దకు భారీగా చేరుకున్నారు. ప్రస్తుతం విజయవాడ కొవిడ్ టీకా కేంద్రాల వద్ద పరిస్థితిని ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.

ఇవీ చూడండి :13.30 లక్షల డోస్​లు ఏ మూలకు సరిపోతాయి ?: చంద్రబాబు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details