ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 30, 2020, 3:18 PM IST

ETV Bharat / state

కరోనా నిబంధనలు పట్టని జనం.. మార్కెట్ల వద్ద గుమిగూడుతున్న వైనం

విజయవాడ నగరంలో మార్కెట్ల ద్వారా కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. పూలు, కూరగాయల మార్కెట్ల వద్ద భౌతిక దూరం అనే మాటే కనిపించడంలేదు. విజయవాడ బస్టాండ్ పక్కన ఉన్న పూల మార్కెట్ వద్ద పూలు కొనేందుకు పెద్దసంఖ్యలో జనం గుమిగూడారు.

people crowd at vijayawada flower market in corona time
మార్కెట్ల వద్ద గుమిగూడుతున్న వైనం

విజయవాడ నగరంలో మార్కెట్ల ద్వారా కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. జిల్లాలో కరోనా కేసులు విజృంభిస్తున్నా ప్రజలు నిబంధనలు పాటించడంలేదు. పూలు, కూరగాయల మార్కెట్ల వద్ద భౌతిక దూరం అనే మాటే కనిపించడంలేదు. వైరస్ వ్యాప్తి అధికమవుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నా అవేవీ పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. విజయవాడ బస్టాండ్ పక్కన ఉన్న పూల మార్కెట్ వద్ద పూలు కొనేందుకు పెద్దసంఖ్యలో జనం గుమిగూడారు. ఇలా అయితే వైరస్ వ్యాప్తిని నియంత్రించలేమంటూ అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details