ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 21, 2020, 5:33 PM IST

ETV Bharat / state

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయంలో భద్రత ఉందా..?

రాష్ట్రంలో దేేవాలయాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయంలో రథాలు, ప్రభల భద్రతపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Penuganchiprolu Tirupatamma Temple
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయం

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయం

రాష్ట్రంలోని పలు ఆలయాల్లో జరుగుతున్న వరుస ఘటనల వల్ల ప్రముఖ ఆలయాల భద్రతను సమీక్షించుకోవలసిన అవసరం ఏర్పడింది.
కృష్ణా జిల్లాలోనే రెండవ అతిపెద్ద దేవాలయంగా వెలుగొందుతున్న పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయంలో విలువైన రథాలు, ప్రభలు ఉన్నాయి. వీటికి గతంలో ఎటువంటి ముప్పు లేకపోవడంతో... ఆలయ ప్రాంగణంలో ఓ మూలకు ఉంచారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు రథాలు, ప్రభలకు పూజలు చేస్తూ.. టెంకాయలు కొడుతుంటారు. ప్రస్తుతం ఆలయంలో పూర్వకాలంగా ఉన్న 90 అడుగుల ఇనుప ప్రభ ఉంది. అది శిథిలావస్థకు చేరటంతో... దాని స్థానంలో రెండేళ్ల క్రితం 66 అడుగుల ఎత్తుతో కొత్త ప్రభను తయారు చేశారు.

ప్రభలు

వార్షిక ఉత్సవాల్లో అమ్మవారి విగ్రహాల ఊరేగింపునకు ప్రత్యేక రథం ఉంది. ఈ ఏడాది దాతల సాయంతో ప్రచార రథం అందుబాటులోకి వచ్చింది. వీటన్నింటిని ఉంచేందుకు ప్రత్యేకమైన స్థలం లేకపోవడంతో ప్రభలను ఆలయం వెనుక భాగాన, ప్రచార రథాన్ని ఆలయం ముందు భాగాన ఉంచుతున్నారు.

పోతురాజు విగ్రహం

వీటితో పాటు ఆలయ ప్రాంగణంలో పోతురాజు విగ్రహం, పాపమాంబ విగ్రహాలు ఎటువంటి రక్షణ లేకుండా బహిరంగంగా ఉన్నాయి. పలు ఆలయాల్లో వరుసగా జరుగుతున్న ఘటనల వల్ల వీటన్నింటిని ఉంచేందుకు రక్షిత ప్రదేశం ఏర్పాటు చేయటంతోపాటు, అనుక్షణం భద్రత కల్పించాల్సిన బాధ్యత ఆలయ అధికారులపై ఉంది. ఈ విషయమై ఆలయ ఈవో ఎస్​వీఎస్​ఎన్ మూర్తి స్పందించారు. పభలు ఉన్న ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. అటువైపు భక్తులు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వాటికి బీమా చేయించినట్లు తెలిపారు. రాత్రివేళల్లో హోంగార్డులు, ఆలయ వాచ్​మెన్, సిబ్బంది పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ఇదీ చూడండి.'అమరావతిని తరలించేందుకు కుట్ర జరుగుతోంది'

ABOUT THE AUTHOR

...view details