ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 11, 2021, 10:53 PM IST

ETV Bharat / state

'నువ్వు చనిపోయావ్​..పెన్షన్​ ఇచ్చేది ఎలా'

ఓ వృద్ధురాలు తన పెన్షన్​ డబ్బులివ్వమని అడిగినందుకు.. నువ్వు చనిపోయావు..అందుకే డబ్బులు ఇవ్వట్లేదని గ్రామ వాలంటీరు సమాధానమిచ్చాడు. ఈ ఘటన మోపిదేవి మండలంలో జరిగింది.

వృద్ధురాలు
వృద్ధురాలు

అనారోగ్య సమస్యలతో ఓ వృద్ధురాలు రెండు నెలలుపాటు కుమార్తె ఇంటికి వెళ్లింది. ఆ రెండు నెలలు ఆమె వితంతు పింఛన్​ తీసుకోలేదు. కుమార్తె ఇంటినుంచి తిరిగి వచ్చిన ఆమె వార్డు వాలంటీర్​ను కలిసి తన పింఛన్​ గురించి అడగ్గా.. ఆమె ఆవాక్కయ్యే సమాధానం వినాల్సి వచ్చింది. రెండు నెలలుగా నువ్వు కనిపించకపోయేసరికి చనిపోయావనుకున్నానని వార్డు వాలంటీర్​ చెప్పాడు.

తాను చనిపోయానని భావించి అధికారులు పింఛన్​ ఆపేశారంటూ కృష్ణాజిల్లా మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ కొత్తపాలెం గ్రామానికి చెందిన సుందరమ్మ అనే వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అనారోగ్యంతో రెండు నెలల క్రితం కుమార్తె ఇంటికి వెళ్లానని... ఆ తర్వాత తనకు పింఛన్​ ఇవ్వలేదని వాపోయింది. వార్డు వాలంటీర్​ను అడగ్గా.. రెండు నెలల పెన్షన్​ ఇస్తామని చెప్పారంది. అయితే ఆ తర్వాత నెల కూడా పింఛన్​ రాలేదని తెలిపింది.

తాజాగా ఈ నెలలో కూడా తనకు పెన్షన్ రాకపోవడంతో గ్రామ వాలంటీర్​ను ప్రశ్నించగా.. సరైన సమాధానం చెప్పలేదని తెలిపింది. పెన్షన్ ఇవ్వకపోగా తాను చనిపోయానని అంటున్నారని వృద్ధురాలు వాపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు 3 నెలలుగా రావాల్సిన పెన్షన్ ఇప్పించాల్సిందిగా వేడుకుంది.

ఇదీ చదవండి:MURDER MYSTERY: భూత వైద్యుడినంటూ లోబరుచుకుని.. పెళ్లికి పట్టుబట్టిందని హతమార్చి

ABOUT THE AUTHOR

...view details