ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వారంలో ఆరుగురికి పాము కాట్లు..ఒకరు మృతి

వరుస పాము కాట్లతో రైతులు బెంబేలెత్తుతున్నారు. కృష్ణాజిల్లా నందిగామ మండలంలో వారం వ్యవధిలో ఆరగురు పాము కాట్లకు గురైయ్యారు.

By

Published : Aug 9, 2019, 3:30 PM IST

Updated : Aug 9, 2019, 5:48 PM IST

వారం రోజుల్లో ఆరుగురికి పాము కాట్లు..ఒకరు మృతి

వారం రోజుల్లో ఆరుగురికి పాము కాట్లు..ఒకరు మృతి

కృష్ణా జిల్లా నందిగామ మండలం కొత్త కంచెల గ్రామంలో వరుస పాము కాట్లు ప్రజల్ని భయకంపితులను చేస్తోంది. గడిచిన వారం రోజుల్లో ఆరుగురు పాము కాటుకు గురికాగా ఇందులో ఒక బాలుడు మృతి చెందాడు. తాజాగా పోలంలో పశువులు కాస్తున్న రైతు తాడపనేని సీతారామయ్య ను పాము కాటువేసింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన అతన్ని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇలా వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పొలాల్లోకి, చీకటి పడితే బయటకు వెళ్లేందుకు ఒకటి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు.

Last Updated : Aug 9, 2019, 5:48 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details