ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 31, 2021, 9:15 AM IST

ETV Bharat / state

Employees unions: ఉద్యోగ సంఘాల నిబంధనల్లోని మార్పుల కోసం.. కొత్త కమిటీ

ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నిబంధనల్లో కొత్త నిబంధనల రూపకల్పన కోసం ఉన్నతాధికారుల కమిటీని ప్రభుత్వం నియమించింది. మార్పులు కూడా ఈ కమిటీ చేయనుంది. ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో.. అనుభవజ్ఞులైన నిపుణలు ఈ బృందంలో పని చేయనున్నారు.

New committee for changes in the rules of Reorganization of Service Associations
ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నిబంధనల్లోని మార్పుల కోసం కొత్త కమిటీ

ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నిబంధనల్లో మార్పులు చేర్పులతో పాటు.. కొత్త నిబంధనల రూపకల్పన కోసం ఉన్నతాధికారుల కమిటీని ప్రభుత్వం నియమించింది. ఉద్యోగ సంఘాల గుర్తింపునకు సంబంధించి (రోసా) రీఆర్గనైజేషన్ ఆఫ్ సర్వీస్ అసోసియేషన్స్ నిబంధనల్లో మార్పులు చేసే నిమిత్తం ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది.

ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో.. రెవెన్యూ శాఖ, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శులు, న్యాయశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖలోని సర్వీసెస్ విభాగం ముఖ్యకార్యదర్శి సభ్యులుగా కమిటీ నియమించారు. రీఆర్గనైజేషన్ ఆఫ్ సర్వీస్ అసోసియేషన్స్ ( రోసా) నిబంధనల అధ్యయనానికి నిపుణులు, ఈ రంగంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు కూడా ప్రభుత్వం తీసుకోనుంది.

ABOUT THE AUTHOR

...view details