ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 1, 2021, 7:21 PM IST

ETV Bharat / state

ప్రజాస్వామ్యాన్ని వైకాపా ప్రభుత్వం అపహస్యం చేస్తోంది: దీపక్ రెడ్డి

వైకాపా ప్రభుత్వ తీరుపై తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మండిపడ్డారు. వైకాపా అరాచకాలను ప్రశ్నించాడానికి వెళ్లిన తెదేపా అధినేత చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలో అడ్డుకోవటాన్ని తీవ్రంగా ఖండించారు.

mlc deepak reddy condemned the obstruction of chandrababu
'తెదేపా ఏ కార్యక్రమం తలపెట్టినా.. పోలీసులతో అక్రమ నిర్బంధాలు చేయిస్తున్నారు'

ప్రజాస్వామ్యాన్ని వైకాపా ప్రభుత్వం అపహస్యం చేస్తోందని తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మండిపడ్డారు. వైకాపా అరాచకాలను ప్రశ్నించేందుకు చిత్తూరు పర్యటనకు వెళ్లిన చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలోనే అడ్డుకోవటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుతో పాటు ఆయన పీఏ, వైద్యాధికారి ఫోన్లను పోలీసులు లాక్కున్నారని ధ్వజమెత్తారు. తెదేపా ఏ కార్యక్రమం తలపెట్టినా.. పోలీసులతో అక్రమ నిర్బంధాలు చేయించటం ఎంతవరకు సబబు అని నిలదీశారు.


ఇదీ చదవండి

'తెదేపా అధినేత చంద్రబాబును అడ్డుకోవడం దారుణం'

ABOUT THE AUTHOR

...view details