ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 11, 2021, 6:00 PM IST

ETV Bharat / state

'అవినీతి సీఎంలను జైలుకు పంపిన వ్యక్తి... అవినీతి సామ్రాట్​తో ఏం మంతనాలు జరిపారు'

ఎంపీ సుబ్రహ్మణ్యస్వామికి... సీఎం జగన్‌తో పనేంటని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. వారిద్దరి మధ్య జరిగిన చర్చలేమిటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

mlc buddha venkanna fire on mp subramanya swami
ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న

ప్రత్యేకవిమానంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఎంపీ సుబ్రహ్మణ్యస్వామికి.. సీఎం జగన్‌తో పనేంటని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న నిలదీశారు. ఎందరో అవినీతి ముఖ్యమంత్రులను జైలుకుపంపిన వ్యక్తి.. అవినీతి సామ్రాట్​తో ఏం మంతనాలు జరిపారని ప్రశ్నించారు. సుబ్రహ్మణ్య స్వామికి జగన్​తో ఉన్న లాలూచీ ఏమిటో, వారిద్దరి మధ్య జరిగిన చర్చలేమిటో బయటపెట్టాలని బుద్దా వెంకన్న డిమాండ్‌చేశారు. రాజకీయ ప్రయోజనాలతోనే సుబ్రహ్మణ్యస్వామి, జగన్ తోసమావేశమయ్యారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details