ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తోన్న 3 టన్నుల నత్తగుల్లలు స్వాధీనం

కృష్ణా జిల్లా మోపిదేవి, అవనిగడ్డ మండలాలలోని కోసురువారిపాలెం, ఎడలంక గ్రామాల నుంచి ముంబయికి అక్రమంగా తరలిస్తున్న నత్తగుల్లల వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By

Published : Jul 25, 2019, 10:33 PM IST

అక్రమంగా తరలిస్తోన్న 3 టన్నుల నత్తగుల్లలు స్వాధీనం

అక్రమంగా తరలిస్తోన్న 3 టన్నుల నత్తగుల్లలు స్వాధీనం

కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కోసురువారిపాలెం, అవనిగడ్డ మండలంలోని ఎడలంక నుంచి అక్రమంగా నత్తగుల్లలను మహారాష్ట్ర తరలిస్తుండగా అటవీ అధికారులు పట్టుకున్నారు. ఎడలంక గ్రామనికి చెందిన కోప్పనాతి లంకేశ్వరరావుతో... ముంబయికి చెందిన మరో నలుగురు కలిసి... నత్తగుల్లలను మహారాష్ట్రకు తరలిస్తుండగా అడ్డుకున్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అవనిగడ్డ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రాయపూడి వేణుగోపాలరావు ఇచ్చిన సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 3 టన్నుల నత్తగుల్లలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details