ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 17, 2020, 10:23 PM IST

ETV Bharat / state

కానుమోలు సబ్​ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కరోనా కలకలం

కృష్ణా జిల్లా కానుమోలు సబ్​ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. సబ్​రిజిస్ట్రార్​కు కరోనా నిర్ధరణ కావడంతో...మూడు రోజుల పాటు కార్యాలయాన్ని మూసివేయాలని అధికారులు నిర్ణయించారు.

corona cases
corona cases

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కానుమోలు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కరోనా కలకలం నెలకొంది. ఐదు రోజుల నుంచి కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్ జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో కార్యాలయ సబ్ రిజిస్ట్రార్ అనుమానంతో కరోనా పరీక్ష చేయించుకున్నారు. సబ్​రిజిస్ట్రార్​కు పాజిటివ్​గా నిర్ధరణ కావడంతో సిబ్బంది కరోనా టెస్టులు చేయించుకున్నారు. అధికారుల అదేశాల మేరకు శనివారం నుంచి 3 రోజులపాటు రిజిస్ట్రేషన్ కార్యాలయం మూసివేయాలని నిర్ణయించారు.

ABOUT THE AUTHOR

...view details