తాటి చెట్టు నుంచి పడి కల్లుగీత కార్మికుడి మృతి
కృష్ణా జిల్లా గొల్లనపల్లిలో ప్రమాదవశాత్తు తాటి చెట్టు నుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతిచెందాడు.
కల్లుగీత
కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లిలో విషాదం చోటు చేసుకుంది. తాటి చెట్టుపైనుంచి ప్రమాదవశాత్తు పడిపోయి కల్లుగీత కార్మికుడు పడమట వెంకటేశ్వరరావు మృతిచెందాడు. రోజువారీగా కల్లు తీయటానికి తాటి చెట్టు ఎక్కాడు. కల్లు తీసే సమయంలో పట్టుతప్పిన క్రమంలో ప్రమాదం జరిగింది.