ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 30, 2020, 3:32 PM IST

ETV Bharat / state

వరద నష్టాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ మాధవి లత

రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవి లత అన్నారు. డిసెంబర్ 15లోగా నష్ట పారిహారం అంచనా వేసి నెలాఖరులోగా సబ్సిడీ అందించాలని సీఎం జగన్ ఆదేశించారని ఆమె తెలిపారు.

Joint Collector Madhavi Latha
వరద నష్టాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ మాధవి లత

కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామంలో వరద నష్టాన్ని జాయింట్ కలెక్టర్ మాధవి లత పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1.20 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిపారు. డిసెంబర్ 15లోగా నష్ట పరిహారం అంచనా వేసి నెలాఖరులోగా సబ్సిడీ అందించాలని సీఎం జగన్ ఆదేశించారని వెల్లడించారు. పాయింట్ల వారిగా తేమ శాతాన్ని పరిశీలించి రైతుల నుంచి ధాన్యం సేకరించాలని మిల్లర్లను ఆదేశించామని ఆమె తెలిపారు. మిల్లర్లు కూడా సహకరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details