ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 24, 2020, 5:25 PM IST

ETV Bharat / state

విషాదం: మట్టిపెళ్లలు మీద పడి యువకుడు మృతి

మట్టిపెళ్లలు మీద పడి పేదకల్లెపల్లి గ్రామంలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు ఇంటర్​ చదువుతున్న మత్తి సాయిగా పోలీసులు గుర్తించారు. తండ్రి మరణించడం వల్ల కుటుంబ పోషణ కోసం కూలి పనులకు వెళ్లాడని పోలీసులు తెలిపారు.

inter student died while sand stones fall upon him in  krishna disrict
మట్టి పెల్లలు విరిగిపడి ఇంటర్​ విద్యార్థి మృతి

కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పేదకల్లెపల్లి గ్రామంలో మట్టిపెళ్లలు విరిగిపడి ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు ఇంటర్​ చదువుతున్న మత్తి సాయి(17)గా పోలీసులు గుర్తించారు. రాత్రి 10 గంటల సమయంలో మట్టిని తవ్వుతుండగా.. ఒక్కసారిగా మట్టిపెళ్లలు మీద పడి మృతి చెందాడని చల్లపల్లి పోలీసులు తెలిపారు.

కుటుంబ పోషణ నిమిత్తం కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడని తెలియజేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details