ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అనుచిత వ్యాఖ్యల కేసులో మరో 44 మందికి నోటీసులు

హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసులో మరో 44 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఇదే కేసులో రెండ్రోజుల క్రితం 49 మందికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

By

Published : May 29, 2020, 1:06 PM IST

Published : May 29, 2020, 1:06 PM IST

Updated : May 29, 2020, 7:24 PM IST

High Court
High Court

న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యల అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్ పిటిషన్ వేశారు.

న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసులో మరో 44 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే గుడివాడ అమర్​నాథ్​రెడ్డి, పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు‌, ఎన్​ఆర్​ఐతో సహా 44 మందికి నోటీసులు ఇచ్చింది. ఇదే కేసులో రెండ్రోజుల క్రితం 49 మందికి నోటీసులు జారీచేసింది. హైకోర్టు ఆదేశాలతో సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. నిందితులపై చర్యలకు సంబంధించి పూర్తి వివరాలతో సీఐడీ అఫిడవిట్ దాఖలు చేసింది. కోర్టులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ కేసుపై తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:ప్రభుత్వానికి షాక్.. ఎస్​ఈసీ రమేష్ కుమార్​ను మళ్లీ నియమించిన హైకోర్టు

Last Updated : May 29, 2020, 7:24 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details