ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 3, 2020, 3:39 AM IST

ETV Bharat / state

లాక్​డౌన్ భయం... సొంతూళ్లకు పయనం

హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ విధింపు ప్రచారం నేపథ్యంలో.... ఏపీ సరిహద్దుల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. ఈ-పాస్‌ ఉన్నవారినే రాష్ట్రంలోకి అనుమతిస్తున్న పోలీసులు..... లేనివారిని వెనక్కి పంపుతున్నారు. పాస్‌ ఉన్నవారైనా రాత్రి 7 గంటల తర్వాత రావడానికి వీల్లేదని స్పష్టం చేస్తున్నారు.

heavy traffic at ap and telangana border
heavy traffic at ap and telangana border

తెలంగాణ- ఏపీ సరిహద్దుల వద్ద మళ్లీ వాహనాలు బారులు తీరుతున్నాయి. హైదరాబాద్‌లో వైరస్‌ కట్టడికి.... అక్కడ మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తారన్న ప్రచారం నేపథ్యంలో ప్రజలంతా వారి సొంతూళ్ల బాటపట్టారు. దీంతో కృష్ణా జిల్లా గరికపాడు చెక్‌పోస్ట్‌ వద్ద వాహనాల రద్దీ నెలకొంటోంది. అయితే... వారిలో చాలామంది వద్ద ఏపీ ప్రభుత్వ అనుమతి ఉన్న ఈ-పాస్‌ లేకపోవటంతో పోలీసులు వారిని వెనక్కి పంపుతున్నారు. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన దగ్గర నుంచి జూన్‌ 30 వరకూ.... గరికపాడు చెక్‌పోస్ట్ మీదుగా రాష్ట్రంలోకి రోజుకు 500 నుంచి 700 మంది వస్తున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆ సంఖ్య వెయ్యికి చేరింది.

డీజీపీ కార్యాలయం, స్పందన వెబ్‌సైట్‌ ద్వారా పొందిన ఈ-పాసులున్న వారినే లోపలికి అనుమతిస్తున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు చెప్పారు. సరిహద్దుల వద్ద ప్రతి ఒక్కరికీ కచ్చితంగా థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి.. వారి వివరాలు నమోదు చేసుకున్నాకే అనుమతిస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండి: 'ఎస్సై నన్ను మోసం చేశాడు'... 'కాదు ఎస్సై మోసపోయాడు'

ABOUT THE AUTHOR

...view details