దిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రప్రథమ క్రీడా విశ్వవిద్యాలయం ఉప కులపతిగా నియమితులైన ప్రముఖ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరిని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అభినందించారు. ఒలింపిక్ పతకం సాధించిన తొలి, ఏకైక భారతీయ మహిళా వెయిట్ లిఫ్టర్ గా కరణం మల్లేశ్వరికి తగిన గౌరవం దక్కిందన్నారు. 2000 సిడ్నీ ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించిన మల్లేశ్వరి ప్రతిభను దేశ పౌరులు ఎల్లప్పటికీ గుర్తుంచుకుంటారని గవర్నర్ కొనియాడారు.
Governor on Malleeshwari: కరణం మల్లీశ్వరికి గవర్నర్ బిశ్వభూషణ్ అభినందనలు
మొట్టమొదటి క్రీడా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమితులైన ప్రముఖ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి(karanam malleeshwari) ని గవర్నర్ బిశ్వభూషణ్(bishwabhooshan harichandan) అభినందించారు.
గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్