ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజృంభిస్తున్న విష జ్వరాలు.. ఇద్దరు మృతి

కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలంలోని నరసింగపాలెంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వరాలతో ఇద్దరు మృతి చెందడంతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు.

By

Published : Apr 1, 2019, 8:52 PM IST

నరసింగపాలెంలో విషం చిమ్ముతున్న జ్వరాలు

నరసింగపాలెంలో విషం చిమ్ముతున్న జ్వరాలు
కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలంలోని నరసింగపాలెం గ్రామస్థులు జ్వరాల బారిన పడి అవస్థలు పడుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ చర్యలు చేపట్టకపోవడం... దోమల బెడద, దుమ్ము కారణంగా అపరిశుభ్రత నెలకొంది. సుమారు 15 రోజుల నుంచీ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇటీవల ఇద్దరు మరణించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. మరికొంతమందినూజివీడు, గన్నవరం, ఆగిరిపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారుల ఆదేశాలతో సద్గురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details