నియోజకవర్గాల వారీగా ఈవీఎంలపై ఉంచే బ్యాలట్ పేపర్ల ముద్రణ పూర్తి అయ్యిందని స్పష్టం చేశారు. విజయవాడ, కర్నూలులోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్లో ముద్రించిన ఈ బ్యాలట్ పత్రాలను ఆయా ప్రాంతాలకు పంపుతున్నట్టు ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. మరోవైపు ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక పోలీసు పరిశీలకులు కె.కె శర్మ సమీక్షించారని ద్వివేది తెలిపారు. ఎన్నికలకు ఎంత మంది భద్రతా సిబ్బంది అవసరం, ఇప్పటి వరకూ ఎన్ని కంపెనీలు వచ్చాయి... ఇంకా ఏమేరకు అవసరం అవుతారన్న అంశాలపై ఆరా తీశారని వివరించారు. అటు ఈవీఎంలు, వీవీప్యాట్ల పనితీరుపై హైకోర్టు న్యాయమూర్తులకు ప్రదర్శన ఇస్తున్నట్టు ఈసీ వెల్లడించింది.
రాష్ట్రంలో పెరిగిన పోలింగ్ కేంద్రాలు
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగటంతో ఆ మేరకు పోలింగ్ కేంద్రాలనూ పెంచుతున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించారు.
రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాలను పెంచుతున్నట్లు ఈసీ వెల్లడి
ఇవి చదవండి