పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రభుత్వం విమర్శలు చేస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. తప్పుడు సమాచారంతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుపై జగన్ పులివెందుల పంచాయతీ పెట్టారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని తెలిపారు. డ్యామ్ సైట్లో గ్రామాలను ఖాళీ చేయించాక నిర్మాణ పనులకు మార్గం సుగమమైందన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో 70 శాతానికి పైగా పనులను పూర్తి చేశామని వివరించారు.
'ఆయన భాషలో చెప్పాలంటే...'
పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రభుత్వం తెదేపాపై ఆరోపణలు చేయటం సరికాదని మాజీ మంత్రి దేవినేని ఉమ తెలిపారు.
దేవినేని ఉమ
Last Updated : Aug 2, 2019, 3:55 PM IST