కరోనా చికిత్స కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ కేసులను ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ చేర్చుకోవాలని పేర్కొంది. ప్రభుత్వాధికారుల పర్యవేక్షణలో ఆసుపత్రుల్లో చేర్చుకోవడమే కాక చికిత్స అందించాలని ఆదేశించింది. కరోనాకు సంబంధించిన 15రకాల కొత్త చికిత్స పద్ధతులను ఆరోగ్యశ్రీ ప్యాకేజీలో చేర్చింది. కరోనా పరీక్షలు, వ్యాధి నిర్ధరణ, వైద్య ఖర్చులకు ధరల ప్యాకేజీని నిర్ణయించింది. ఈ ధర కనీస మొత్తం 16వేల రూపాయల నుంచి గరిష్ఠంగా 2లక్షల 16వేల వరకూ ఉండనుంది.
కరోనా చికిత్స కేసులు ఆరోగ్యశ్రీ పరిధిలోకి... ప్రభుత్వం ఆదేశాలు
కరోనా చికిత్స కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకు వస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ 19 కేసులను ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్చుకోవాలని ఈమేర ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా చికిత్స కేసులు ఆరోగ్యశ్రీ పరిధిలోకి... ప్రభుత్వం ఆదేశాలు