అడవి మధ్యలో ఉద్యానవనం.... సీతాకోకచిలుకలకు ప్రత్యేకం
సీతాకోకచిలుక కనబడితే చాలు దానిని అలానే చూస్తూ ఉండిపోతాం. అలాంటిది వందలాది సీతాకోకచిలుకలు ఒకేచోటా విహరిస్తుంటే కనురెప్ప వేయాలనిపించదు కదా. పర్యటకులకు ఇలాంటి అనుభూతినే పంచేందుకు అటవీ శాఖ ఓ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేస్తోంది. మూలపాడు అటవీ ప్రాంతంలో దీనిని సిద్ధం చేస్తోంది.
సీతాకోకచిలుక
కృష్ణా జిల్లా జిల్లాలోని మూలపాడు అటవీ ప్రాంతం పచ్చని అందాలను పరచుకుని ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంటుంది. ప్రత్యేకంగా సీతాకోకచిలుకల కోసమే చాలా మంది మూలపాడు అటవీ ప్రాంతంలోకి వెళ్తుంటారు. అందుకే వాటిని వెతుక్కుంటూ ప్రకృతి ప్రియులు అడవి బాట పట్టకుండా సీతాకోకచిలుకలనే సందర్శకుల చెంతకు తీసుకొచ్చేందుకు అటవీ శాఖ పనులు మొదలుపెట్టింది. మూలపాడు వద్ద సీతాకోకచిలుకల ఉద్యానవనాన్ని సిద్ధం చేస్తోంది.