ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 28, 2020, 11:14 PM IST

ETV Bharat / state

వైద్యుడిని లాఠీలతో కొట్టడం అమానుషం

దళితుడైన వైద్యుడిని రోడ్డుపై అర్ధనగ్నంగా చేసి లాఠీలతో కొట్టడం దారుణమని భాజపా నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. వైద్యుడు సుధాకర్ విషయంలో జగన్ ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

mothkupalli on ysrcp
వైకాపాపై మోత్కుపల్లి నర్సింహులు ఆగ్రహం

వైద్యుడు సుధాకర్ విషయంలో జగన్ ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందని భాజపా నేత మోత్కుపల్లి నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ 97వ జయంతి సందర్భంగా ఆయన హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. పాదయాత్రకు ముందు కృష్టా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెడతామని మాట ఇచ్చి.. సంవత్సరమైనా.. సీఎం జగన్ దాని ఊసే ఎత్తడం లేదని ఆయన ఆక్షేపించారు.

దళితుడైన వైద్యుడిని రోడ్డుపై అర్థనగ్నంగా చేసి లాఠీలతో కొట్టడం దారుణమని మోత్కుపల్లి నర్సింహులు దుయ్యబట్టారు. గెలిచే ముందు ప్రజల మనిషిగా ఉండి....గెలిచాక ప్రజలను కించపరుస్తున్నారని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: రంగుల అంశంపై హైకోర్టుకు సీఎస్​, పంచాయతీ ముఖ్య కార్యదర్శి

ABOUT THE AUTHOR

...view details