మచిలీపట్నం డీఎహెచ్వో కార్యాలయం ముట్టడి.. అరెస్ట్
ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఏఎన్ఎమ్ లు మచిలీపట్నం డీఎహెచ్వో కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఉద్యోగ భద్రత కల్పించాలంటూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఏఎన్ఎమ్ లు ఆందోళనకు దిగారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వయోపరిమితి, రాత పరీక్షలు అవసరం లేకుండా తమను గ్రామ సచివాలయాల్లో ఏఎన్ఎంలుగా నియమించాలని వారు డిమాండ్ చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని.. వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.
TAGGED:
anms andolana