వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్... పార్టీకి మొదటినుంచి కష్టపడి పని చేసిన కార్యకర్తలను విస్మరించి ఇతర పార్టీ వాళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని కృష్ణా జిల్లా వైకాపా సేవా దళ్ నాయకులు మావులేటి వెంకటరాజు ఆరోపించారు. వేరే నియోజకవర్గం నుంచి వచ్చినా... పార్టీపై ఉన్న అభిమానంతో జోగి రమేష్ను గెలిపించామన్నారు. పార్టీ కోసం పని చేసిన వారికి కాకుండా ఇతర పార్టీ నాయకులకు పదవులు కట్టబెడుతూ... కార్యకర్తలను కనీసం కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని వాపోయారు.
సొంత పార్టీ కార్యకర్తలనే అరెస్టు చేయిస్తున్నారని... నియోజకవర్గంలో ఎమ్మెల్యే అరాచకాలతో పార్టీ కార్యకర్తలు భయాందోళనలకు గురవుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే నియోజకవర్గంలో పోలీసుల తీరుపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని... తక్షణమే జోగి రమేష్పై చర్యలు తీసుకోవాలని కోరారు.