Minister Dadisetti Raja comments: కాకినాడ జిల్లా తునిలో తెదేపా నేత, మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావు మీద జరిగిన హత్యాయత్నంపై మంత్రి దాడిశెట్టి రాజా స్పందించారు. వ్యక్తుల మీద దాడి చేసే సంస్కృతి మాది కాదన్నారు. యనమల రామకృష్ణుడు వల్ల, వాళ్ల తమ్ముడు వల్ల గత 40 ఏళ్లలో 40 హత్యలు జరిగాయని హత్యకు గురైన వారి ఫొటోలతో హైదరాబాద్లో మీ ఇంటి ముందు ఫ్లెక్సీలు పెడతానని ఆయన స్పష్టం చేశారు.
అసలేం జరిగింది: తుని.. గురువారం ఉదయం 6 గంటల సమయం.. తెదేపా నేత, మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావు ఇంటికి గుర్తుతెలియని వ్యక్తి భవాని మాలధారణలో భిక్ష కోసం వచ్చారు. శేషగిరిరావు బియ్యం వేస్తుండగా ఒక్కసారిగా కత్తి బయటకు తీశాడు. తలపై నరికేందుకు యత్నించగా.. అప్రమత్తతో ఉన్న శేషగిరిరావు వెంటనే తప్పించుకున్నారు. కానీ మరోసారి చేతిపై దాడి చేసిన దుండగుడు.. వెంటనే అక్కడినుంచి బయటకు వెళ్లిపోయాడు. అనంతరం బైక్పై పరారయ్యాడు. శేషగిరిరావు చేతికి, తలకు తీవ్రగాయాలు కాగా.. కుటుంబసభ్యులు వెంటనే కాకినాడలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.