ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 13, 2021, 5:10 PM IST

Updated : Mar 13, 2021, 7:38 PM IST

ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాలలో మత్తు పదార్థాల కలకలం

గంటూరు జిల్లా తాడేపల్లిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు వైట్​నర్​ సేవిస్తూ..ఉపాధ్యాయులకు పట్టుపడ్డారు. దీనిపై దృష్టి సారించిన ఉన్నతాధికారులు..మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు.

ప్రభుత్వ పాఠశాలలో మత్తు పదార్థాల కలకలం
ప్రభుత్వ పాఠశాలలో మత్తు పదార్థాల కలకలం

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మత్తు పదార్థాల వినియోగం కలకలం రేపుతోంది. తరగతులు ముగిసిన అనంతరం విద్యార్థులు వైట్​నర్ సేవిస్తూ.. ఉపాధ్యాయులకు పట్టుబడ్డారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ఉప విద్యాశాఖాధికారి సమావేశమయ్యారు. పిల్లల ప్రవర్తనపై దృష్టి సారించాలని వారికి సూచించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

Last Updated : Mar 13, 2021, 7:38 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details