గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం చెన్నుపాడు గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ అనే వ్యక్తి మృతి చెందాడు.
ముందునుంచి వస్తున్న లారీ హఠాత్తుగా మలుపు తిరగి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. బైకుపై ఉన్న మస్తాన్ తలకు బలంగా గాయమైంది. చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా.. దారిలోనే మృతి చెందాడు. యడ్లపాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.