తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా తెదేపా ఎన్ఆర్ఐ విభాగం సహకారంతో గుంటూరు జిల్లా బాపట్లలో పేదలకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, గర్భిణీలకు పండ్లు అందజేశారు.
బాపట్లలో పేదలకు నిత్యావసరాలు అందించిన తెదేపా నేతలు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతలు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పేదలకు సహాయం చేస్తూ.. తమ అభిమాన నాయకుడి మీద ప్రేమను చాటుకున్నారు.
పేదలకు, రోగులకు నిత్యావసరాలు, పండ్లు పంపిణీ