ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ACCIDENT : లారీ ఢీ కొని ఆరేళ్ల బాలుడు మృతి

గుంటూరు జిల్లా నరసరావుపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని లారీ ఢీ కొట్టడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

By

Published : Aug 20, 2021, 11:46 PM IST

Published : Aug 20, 2021, 11:46 PM IST

లారీ ఢీ కొని ఆరేళ్ల బాలుడు మృతి
లారీ ఢీ కొని ఆరేళ్ల బాలుడు మృతి

గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ప్రకాష్​నగర్ ప్రాంతానికి చెందిన సాయి శ్రీ చరిత్... అనే బాలుడు ఇంటి బయట ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో కుమ్మరిపాలెం నుంచి ప్రకాష్​నగర్ కు వస్తున్న ఐషర్ లారీ బాలుడిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సాయి శ్రీ చరిత్ లారీ వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు... సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. బాలుడి తండ్రి ఫిర్యాదుతో ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం బాలుని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని స్టేషన్​కు తరలించి, లారీ డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నట్లు నరసరావుపేట ఒకటో పట్టణ సీఐ ప్రభాకరరావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details