ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సముద్ర స్నానానికి వెళ్లి.. అనంత లోకాలకు

గుంటూరు జిల్లా దిండి బీచ్ వద్ద విషాదం జరిగింది. సముద్ర స్నానానికి వెళ్లి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

By

Published : Jun 14, 2019, 8:03 PM IST

Updated : Jun 14, 2019, 8:09 PM IST

యువకుడు మృతి

సముద్ర స్నానానికి వెళ్లి... అనంతలోకాలకు

గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో దిండి బీచ్ వద్ద విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. నగరం మండలం కట్టవ గ్రామస్థులు పుట్టువెంట్రుకల వేడుకకు వచ్చి.. సుమారు 100 మంది సముద్రం వద్దకు వెళ్ళారు. అందరు సంతోషంగా స్నానాలు చేస్తుండగా ఐదుగురు యువకులు లోపలికి వెళ్ళారు. అలల ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగి... మహ్మద్ యూసఫ్ అనే యువకుడు నీటిలో గల్లంతయ్యాడు. గమనించిన మిగిలిన నలుగురు ఒడ్డుకు వచ్చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి యువకుడి మృతదేహాన్ని వెలికి తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంతోషంగా వేడుక చేసుకునేందుకు వచ్చిన వారికి.. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Last Updated : Jun 14, 2019, 8:09 PM IST

ABOUT THE AUTHOR

...view details