ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని వ్యక్తి మృతి

By

Published : Aug 8, 2020, 12:10 AM IST

రెండు బైక్​లు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా పుల్లడిగుంట వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనలో అవినాష్​ అనే వ్యక్తి మరణించగా… మరొకరికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

road accident at guntur district pulladigunta and a person died
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అవినాష్​

రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన తెనాలి అవినాష్​ (23) అనే వ్యక్తి మృతి చెందాడు. గుంటూరు నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రత్తిపాడు వైపు నుంచి వస్తున్న బైక్​… పుల్లడిగుంట వద్ద ఢీకొట్టింది. ప్రమాదంలో అవినాష్ అక్కడికక్కడే చనిపోగా… మరొకరికి గాయాలయ్యాయి. పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details