రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన తెనాలి అవినాష్ (23) అనే వ్యక్తి మృతి చెందాడు. గుంటూరు నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రత్తిపాడు వైపు నుంచి వస్తున్న బైక్… పుల్లడిగుంట వద్ద ఢీకొట్టింది. ప్రమాదంలో అవినాష్ అక్కడికక్కడే చనిపోగా… మరొకరికి గాయాలయ్యాయి. పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని వ్యక్తి మృతి
రెండు బైక్లు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా పుల్లడిగుంట వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనలో అవినాష్ అనే వ్యక్తి మరణించగా… మరొకరికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అవినాష్