ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 28, 2020, 7:06 PM IST

ETV Bharat / state

'రైతులకు బేడీలపై సీఎం, డీజీపీ క్షమాపణ చెప్పాలి'

అరెస్ట్ అయిన అమరావతి రైతుల కుటుంబాలను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించారు. అమరావతి రైతులకు బేడీలపై సీఎం, డీజీపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధానికి భూములిచ్చిన తమపైనే కేసులు పెట్టారని రైతుల కుటుంబాలు విచారం వ్యక్తం చేశారు.

nara lokesh on amaravathi farmers arrest
అమరావతి రైతుల అరెస్టుపై నారా లోకేశ్

అమరావతి రైతులకు బేడీలపై సీఎం, డీజీపీ వెంటనే క్షమాపణ చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన అమరావతి రైతుల కుటుంబాలను పరామర్శించారు. రాజధానికి భూములిచ్చిన తమపైనే కేసులు పెట్టారని రైతులు కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి.

రైతుల చేతులకు బేడీలు చూస్తానని ఎప్పుడూ అనుకోలేదని నారా లోకేశ్‌ విచారం వ్యక్తం చేశారు. నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తే తప్పు ఒప్పవుతుందా అని లోకేశ్ ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details