ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 15, 2020, 5:26 PM IST

ETV Bharat / state

పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి.. మోసం చేసి

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో డీ ఫార్మసీ చదువుతోన్న యువతికి.. తెలంగాణలోని ఖమ్మానికి చెందిన యువకునితో ఫేస్​బుక్​లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు..తనను మోసం చేసి వెళ్లిపోయాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

man cheats a girl in the name of love
పెళ్లిచేసుకుంటానని మాయమాటలు చెప్పి.. మోసం చేసి

కృష్ణా జిల్లా కొత్తూరు గ్రామానికి చెందిన ఓ యువతి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో డీ ఫార్మసీ చదువుతోంది. ఆ యువతికి ఖమ్మం జిల్లాకు చెందిన కన్నెగంటి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తితో ఫేస్​బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. శ్రీధర్.. తనను ప్రేమించాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి గుంటూరులోని ఓ హోటల్​లో రెండు నెలలు ఉంచినట్లు బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత శ్రీధర్ తనను మోసం చేసి వెళ్లిపోయినట్లు తెలిపింది.

ఫోన్ చేస్తే స్విచ్​ ఆఫ్ రావటంతో.. తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుంటూరులోని అరండల్​పేట పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details