ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 3, 2020, 10:20 PM IST

ETV Bharat / state

'లాక్​డౌన్ నుంచి రెండు రోజుల మినహాయింపు'

గుంటూరు జిల్లా నరసరావుపేటలో రెండు రోజుల పాటు లాక్​డౌన్ నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు స్థానిక ఆర్డీఓ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. సోమ, మంగళవారం రెండు రోజులు ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు సమకూర్చుకోవాలని సూచించారు.

ప్రజల నిత్యావసరాల కోసం గుంటూరు జిల్లా నరసరావుపేటలో రెండు రోజుల పాటు లాక్​డౌన్ నుంచి వెసులుబాటు కల్పిస్తున్నట్లు స్థానిక ఆర్డీఓ మొగిలి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. సోమవారం, మంగళవారం రెండు రోజులు లాక్ డౌన్ ఆంక్షలు తొలగిస్తున్నట్లు తెలిపారు.

ప్రజలు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కావలసిన నిత్యావసర సరకులు, కూరగాయలు కొనుగోలు చేసుకోవచ్చన్నారు. ఆతరువాత ఎవరికి బయటకు వచ్చేందుకు ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. విక్రయదారులు కూడా వినియోగదారులు భౌతికదూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details