ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 29, 2020, 4:40 PM IST

ETV Bharat / state

'హైకోర్టు తీర్పు దేశ చరిత్రలోనే ఓ గొప్ప అంశం'

నిమ్మగడ్డ రమేశ్ కుమార్​ను తిరిగి నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు దేశ చరిత్రలోనే గొప్ప అంశమని ప్రముఖ న్యాయవాది అశ్వనీకుమార్ అన్నారు. ప్రభుత్వ ఆర్డినెన్స్​ను సవాల్‌ చేస్తూ నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు పరిగణనలోకి తీసుకుందని ఆయన వెల్లడించారు.

Lawer_Aswani_Kumar
Lawer_Aswani_Kumar

ప్రముఖ న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌తో ముఖాముఖి

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను ఆర్డినెన్స్‌ ద్వారా తొలగించడం ప్రభుత్వానికి కుదరదని హైకోర్టు తేల్చి చెప్పిందని ప్రముఖ న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ అభిప్రాయపడ్డారు. ఈ తీర్పు దేశ చరిత్రలోనే ఓ గొప్ప అంశమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆర్డినెన్స్​ను సవాల్‌ చేస్తూ నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు పరిగణనలోకి తీసుకుందని.... ఇతర వాజ్యాలన్నీ ఈ పిటిషన్‌కు అనుబంధంగా నిలిచాయన్నారు. మే ఎనిమిదో తేదీన వాదనలు పూర్తి చేసినప్పటికీ... అన్ని అంశాలను కూలంకషంగా పరిగణనలోకి తీసుకుని న్యాయస్థానం తుది తీర్పును వెల్లడించిందని వివరించారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details