ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 7, 2021, 12:09 PM IST

ETV Bharat / state

నడుము నొప్పికి గుంటూరు జీజీహెచ్​లో ల్యాప్రోస్కోపిక్​ సర్జరీ..

ఉరుకుల పరుగుల జీవితంతో ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు. వాటిల్లో ముఖ్యమైనది నడుము నొప్పి సమస్య. చిన్న వయసు వారికి కూడా డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చిన్న వయసులోనే నడుముకు ఓపెన్ సర్జరీ చేయుంచుకోవడం అంటే సాహసమే. అయితే ప్రైవేటు ఆస్పత్రుల్లో సూక్ష్మ రంధ్రం(ల్యాప్రోస్కోపిక్​) ద్వారా శస్త్రచికిత్స చేస్తారు. అందుకు లక్షలు ఖర్చు అవుతుంది. పేద , మధ్య తరగతి వారికి ఇది భారమే. అయితే ఇప్పుడు ఈ సర్జరీని గుంటూరు సర్వజనాసుపత్రిలో ఉచితంగా చేస్తున్నారు.

LATEST TREATMENT
LATEST TREATMENT

పశ్చిమ గోదావరి జిల్లా కోయలగూడెం రాజవరం గ్రామానికి చెందిన రమ్య వయసు 25 సంవత్సరాలు. ఆమె ఆరు నెలలుగా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతోంది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. రకరకాల చికిత్సలను పొందినా ఫలితం లేకపోయింది. చికిత్స నిమిత్తం గత నెల 17న గుంటూరు సర్వజనాస్పత్రిలోని న్యూరోసర్జరీ రెండో యూనిట్లో చేరింది. వైద్య పరీక్షలు నిర్వహించగా నడుము భాగంలో వెన్నుపూస జారి ఎడమ కాలుకి వచ్చే నాడి నొక్కు కుందని గమనించారు వైద్యులు. దీంతో ఈ నెల 3న నొక్కుతున్న డిస్కు భాగాన్ని మాత్రమే తొలగించేందుకు సూక్ష్మ రంధ్రం ద్వారానే సర్జరీ చేశారు.

ఈ రకం సర్జరీతో వెన్నుకు గానీ, వెన్ను కండరాలకు గానీ ఎలాంటి నష్టం ఉండదని వైద్యులు తెలిపారు. ప్రైవేటు ఆసుప త్రుల్లో రూ.లక్షల ఖరీదైన ఈ శస్త్రచికిత్సను సర్వజనాసుపత్రిలో ఇక నుంచి పూర్తి ఉచితంగా చేయనున్నట్లు న్యూరో సర్జరీ విభాగం ఆచార్యులు శేషాద్రి శేఖర్ వివరించారు. అవసరమైన రోగులు ప్రతి మంగళ, గురు వారాల్లో పొరుగు రోగుల విభాగంలోని 19వ నంబరు గదిలో సంప్రదించవచ్చని తెలిపారు.

ఇదీ చదవండి:ఆహార పదార్థాల తయారీలో నాణ్యత కరువు

ABOUT THE AUTHOR

...view details