మూడోతరం క్షిపణులను విజయవంతంగా ప్రయోగించిన డీఆర్డీఓ.. త్వరలోనే వీటిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయనుంది. స్వల్ప దూరంలోని లక్ష్యాలను చేధించే తేలికపాటి ట్యాంకు విధ్వంసక క్షిపణులను డీఆర్డీఓ కర్నూలులోని ఓర్వకల్లు వద్ద రెండు రోజుల కిందటే పరీక్షించింది. వీటితో పాటు.. మిగిలిన క్షిపణుల ఉత్పత్తి పెంచి ఎగుమతులపై దృష్టి సారిస్తామని డీఆర్డీఓ సతీష్రెడ్డి తెలిపారు.
ఇక క్షిపణుల ఎగుమతిపై దృష్టి : డీఆర్డీఓ ఛైర్మన్
పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రక్షణ రంగానికి అవసరమైన క్షిపణులు అందిస్తున్న రక్షణపరిశోధన అభివృద్ధి సంస్థ- డీఆర్డీఓ ఇక క్షిపణులు ఎగుమతులపై దృష్టి సారించనుంది. రాబోయే రోజుల్లో మరిన్ని క్షిపణి ప్రయోగాలు చేస్తామని డీఆర్డీఓ ఛైర్మన్ సతీష్రెడ్డి స్పష్టం చేశారు. మూడోతరం క్షిపణుల అభివృద్ధిని చేపడుతున్నామని చెబుతున్న డీఆర్డీఓ ఛైర్మన్ సతీష్ రెడ్డి తో ఈటీవీ భారత్ ముఖాముఖి....
త్వరలోనే భారత్ అమ్ములపొదిలోకి మూడోతరం క్షిపణులు:డీఆర్డీఓ ఛైర్మన్