ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 13, 2019, 3:06 PM IST

ETV Bharat / state

ఇక క్షిపణుల ఎగుమతిపై  దృష్టి : డీఆర్​డీఓ ఛైర్మన్

పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రక్షణ రంగానికి అవసరమైన క్షిపణులు అందిస్తున్న రక్షణపరిశోధన అభివృద్ధి సంస్థ- డీఆర్​డీఓ ఇక క్షిపణులు ఎగుమతులపై దృష్టి సారించనుంది. రాబోయే రోజుల్లో మరిన్ని క్షిపణి ప్రయోగాలు చేస్తామని డీఆర్​డీఓ ఛైర్మన్ సతీష్​రెడ్డి స్పష్టం చేశారు. మూడోతరం క్షిపణుల అభివృద్ధిని చేపడుతున్నామని చెబుతున్న డీఆర్​డీఓ ఛైర్మన్ సతీష్ రెడ్డి తో ఈటీవీ భారత్ ముఖాముఖి....

త్వరలోనే భారత్ అమ్ములపొదిలోకి మూడోతరం క్షిపణులు:డీఆర్​డీఓ ఛైర్మన్

మూడోతరం క్షిపణులను విజయవంతంగా ప్రయోగించిన డీఆర్​డీఓ.. త్వరలోనే వీటిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయనుంది. స్వల్ప దూరంలోని లక్ష్యాలను చేధించే తేలికపాటి ట్యాంకు విధ్వంసక క్షిపణులను డీఆర్​డీఓ కర్నూలులోని ఓర్వకల్లు వద్ద రెండు రోజుల కిందటే పరీక్షించింది. వీటితో పాటు.. మిగిలిన క్షిపణుల ఉత్పత్తి పెంచి ఎగుమతులపై దృష్టి సారిస్తామని డీఆర్​డీఓ సతీష్​రెడ్డి తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details