ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 26, 2020, 2:34 PM IST

ETV Bharat / state

పిడుగురాళ్లలో అమ్మవారి నగలు మాయం!

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారి మెడలో వేసే బంగారు గోలుసులు మాయమయ్యాయి. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

పిడుగురాళ్లలో అమ్మవారి నగలు మాయం!
పిడుగురాళ్లలో అమ్మవారి నగలు మాయం!


గుంటూరు జిల్లా పిడుగురాళ్ల లోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి మెడలో వేసే రెండు బంగారు గొలుసులు మాయమైనట్లు సమాచారం. గురువారం రాత్రి అమ్మ వారిని అలంకరించడం కోసం అమ్మవారి మెడలో ఉన్నటువంటి రెండు నగలు తీసి కవర్లో పెట్టారు. పూలతో అలంకరించిన తర్వాత గొలుసులు వేయడానికి చూస్తే ఆభరణాలు కనిపించలేదు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించినట్లు తెలిసింది. నగల విలువ పది లక్షల వరకు ఉంటుందని సమాచారం. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details