ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 17, 2021, 8:46 AM IST

ETV Bharat / state

మాడుగుల బ్యాలెట్ పత్రాల్లో తప్పులు..నిలిచిన పోలింగ్

గుంటూరు జిల్లా గురజాల మండలం మాడుగుల పంచాయతీలో బ్యాలెట్ పత్రాల్లో తప్పులు రావటం వలన.. పోలింగ్ నిలిచిపోయింది.

Incorrect polling in Madugula ballot papers
మాడుగుల బ్యాలెట్ పత్రాల్లో తప్పులు..నిలిచిన పోలింగ్

గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో మూడో దశ ఎన్నికలు 8 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. మాడుగులలో బ్యాలెట్ పత్రాల్లో తప్పులు రావడంతో పోలింగ్ నిలిచిపోయింది. ఇద్దరు అభ్యర్థులకు అధికారులు ఒకే గుర్తు ముద్రించారు. దీంతో 12, 13 వార్డుల్లో పోలింగ్ నిలిచిపోయింది. తిరిగి ఈనెల 21న మాడుగులలో పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details