ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 28, 2020, 10:43 AM IST

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఓ వాహనాన్ని గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీసులు పట్టుకున్నారు. 82 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు.

Illegal ration rice sezied in madikonduru
అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా తరలిస్తున్న 82 క్వింటాళ్ల చౌక బియ్యాన్ని గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టగా మేడికొండూరు నుంచి పేరేచర్ల వైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని ఆపారు. అనుమానం వచ్చి సోదా చేయగా.... అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారని గుర్తించారు. సరకును, వాహనాన్ని సీజ్ చేసి.. ఓ వ్యక్తి​పై కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details